భువనగిరి: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వైభవంగా నిత్య కళ్యాణం
యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మంగళవారం స్వామివారి నిత్య కళ్యాణం వైభోగంగా జరిగింది. ఆలయంలో మహా మండపంలో స్వామివారిని అమ్మవారిని కొత్త వస్త్రాలు పూలతో అలంకరించి వేదమంత్రాల మధ్య సుమారు రెండు గంటల పాటు కళ్యాణ తంతును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు స్వామి వారికి పట్టు వస్త్రాలు ఒడిబియ్యం సమర్పించి ముక్కులు చెల్లించుకున్నారు.