అనంతపురం నగేష్ బ్యారులోని రాప్తాడు సమీపంలో జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో ధర్మవరం పట్టణానికి చెందిన మహబూబ్బాషా అనే వ్యక్తికి గాయాలయ్యాయి. దీంతో అతనిని అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.