హైదరాబాద్ లోని పీవీ నరసింహరావు ఎక్స్ ప్రెస్ వే తరహాలో నెల్లూరుకు ఎక్స్ ప్రెస్ వే నిర్మించాలనీ సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కేంద్రానికి లేఖ రాశారు. హైవేకి ఇరువైపులా నివాసాలు, వాణిజ్య, పారిశ్రామిక నిర్మాణాలు పెరుగుతున్నాయన్నారు.త్వరలో చేపట్టబోయే ఆరులేన్ల రహదారితో నగర అంతర్గత రోడ్డు నెట్ వర్క్ కీలకంగా మారనుందనీ లేఖలో పేర్కొన్నారు. ఈ అంశాలన్నింటిని దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ ను తగ్గించడంతో పాటు ప్రయాణికుల భద్రత నేపథ్యంలో ఎక్స్ ప్రెస్ వే నిర్మించాల్సిన అవసరం ఉందనీ శనివారం కోరారు