అనంతపురం జిల్లా వజ్రకరూరు లో గురువారం రాత్రి 7 గంటల సమయంలో కుటుంబ సమస్యలతో బాధపడుతూ బాలు అనే వ్యక్తి ఇంటిలోనే పురుగులు మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన మెరిగైన చికిత్స కోసం అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.