ప్రకాశం జిల్లా వ్యాప్తంగా పలు లాడ్జిలను శనివారం పోలీస్ అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు లాడ్జిలను తనిఖీ చేసి కొత్తగా ప్రజలను అద్దెకు తీసుకున్న వారి వివరాలతో పాటు ఎప్పటికప్పుడు గదులను అద్దెకు తీసుకున్న వారి పూర్తి వివరాలను సేకరించి రికార్డులో భద్రపరచాలని పోలీసు అధికారులు నిర్వాహకులకు తెలిపారు.