నగర పాలక కార్యాలయం నుంచే ప్లాస్టిక్ నిషేధం అమలు చేద్దాం.. కమిషనర్ పి నరసింహ ప్రసాద్ ఉద్యోగులకు స్టీల్ బాటిళ్లు పంపిణీ చిత్తూరు : చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలో ప్లాస్టిక్ నిషేధం పటిష్టంగా అమలు చేయాలని, నగర పాలక కార్యాలయం నుంచే ప్లాస్టిక్ నిషేధం అమలు చేద్దామని స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర" కార్యక్రమాల్లో భాగంగా ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2016 ప్రకారం నగరంలో సింగల్ యూస్ ప్లాస్టిక్, నిషేధిత ప్లాస్టిక్ నిషేధాన్ని పక్కాగా అమలు చేయడంలో భాగంగా గురువారం నగర పాలక కార్యాలయంలో ఏఐఐఎల్ఎస్జీ సౌజన్యంతో నగరపాలక ఉద్యోగులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు