పూతలపట్టు: కాణిపాకం శ్రీ మణికంఠేశ్వర స్వామివారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం
కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి అనుబంధ దేవాలయమైన శ్రీ మణికంఠేశ్వర స్వామి వారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా సోమవారం తొలి రోజు సరస్వతి దేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారికి ప్రత్యేక కుంకుమార్చనలు, పూజలు నిర్వహించి, రాత్రి గ్రామోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో పెంచల కిషోర్, ఆలయ ఏఈఓ రవీంద్రబాబు, సూపర్డెంట్ కోదండపాణి, అర్చకులు, వేద పండితులు తదితరులు పాల్గొన్నారు.