పీలేరులో తలుపుల ప్రాథమిక ఆరోగ్య కేంద్రము మరియు పీలేరు మండల న్యాయసేవ సంస్థ ఆధ్వర్యంలో సార్వత్రిక ఆరోగ్య కవరేజ్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ అవగాహన కార్యక్రమంలో డాక్టర్ చంద్రశేఖర్ నాయక్ మరియు పీలేరు కోర్టు పారా లీగల్ వాలంటరీ కె.గట్టప్ప సంయుక్తంగా శుక్రవారం సాయంత్రం పీలేరు పట్టణం బండ్లవంక లో నిర్వహించిన "2025 సార్వత్రిక ఆరోగ్య కవరేజ్ దినోత్సవం" కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వం అందించే నగదు రహిత అన్నిరకాల ఆరోగ్య సేవలు,మరియు పథకాలపై అవగాహన అలవర్చుకొని సద్వినియోగం చేసుకోవాలని ఫలితంగా వ్యాధుల రహిత సమాజం అశిద్దామని డాక్టర్ చంద్రశేఖర్ నాయక్ అన్నారు.