అనంతపురం జిల్లా పి యాలేరు గ్రామంలో ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య
Anantapur Urban, Anantapur | Sep 15, 2025
అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం లోని ఆత్మకూరు మండలం పి యాలేరు గ్రామానికి చెందిన కుంటేన్న అనే వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. దీంతో గమనించిన కుటుంబ సభ్యులు అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.