కొండపి: టంగుటూరు లోని బాపూజీ నగర్ వద్ద లారీని వెనక నుంచి ఢీకొట్టిన మరో లారీ, చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం బాపూజీ నగర్ సమీపంలోని జాతీయ రహదారిపై సోమవారం ముందు వెళ్తున్న లారీని మరో లారీ వెనకనుంచి ఢీకొట్టడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. లారీ ఒంగోలు నుండి నెల్లూరు వైపు వెళ్తున్న సమయంలో ఈ సంఘటన జరిగిందని ఎస్ఐ నాగమల్లేశ్వరరావు తెలిపారు. మొదట ప్రమాదంలో చింత భాస్కర్ అనే వ్యక్తికి తీవ్రగాయాలు కావడంతో అతనిని ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించామని అక్కడ చికిత్స పొందుతూ భాస్కర్ మృతి చెందినట్లుగా ఎస్సై తెలిపారు.