ఆర్మూర్: గోవింద్ పేట్ గ్రామంలో దేవి మండపం వద్ద ఘనంగా చండీయాగం నిర్వహించిన దేవీ ఉత్సవ కమిటీ సభ్యులు
ఆర్మూర్ మండలంలోని గోవింద్ పెట్ గ్రామంలో దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దేవి మండపం వద్ద బుధవారం మధ్యాహ్నం 12:30 దేవీ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో చండీయాగాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ గ్రామంలో గ్రామస్తులంతా కలిసి ఒకే చోట దేవి విగ్రహాన్ని ప్రతిష్టించి అమ్మవారికి ప్రతిరోజు ప్రత్యేక పూజలు సామూహిక కుంకుమార్చన హారతి కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.