కడప జిల్లా బద్వేల్ పట్టణంలో స్థాయి అథ్లెటిక్స్ ఎంపికైన విద్యార్థులను మంగళవారం ఉపాధ్యాయులు అభినందించారు. బద్వేల్ పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని షేక్ జాస్మిన్ శ్రీకాకుళం జిల్లా పలాసలో జరిగిన అండర్ 14 రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ హైజంప్ పోటీలలో రెండవ స్థానం సాధించి నేషనల్ స్థాయిలో జరిగే పోటీలకు అర్హత సాధించింది. మరియు 400 మీటర్ల రిలే పోటీలలో మూడవ స్థానం సాధించగా, ఇదే పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న దాదాపీర్ అనే విద్యార్థి డిస్కస్ త్రో లో నాలుగవ స్థానం సాధించడం జరిగింది.