తెలంగాణ రాష్ట్రం ఖమ్మంలో ఈ నెల 18న సీపీఐ శత వార్షికోత్సవ జాతీయ మహాసభను పెద్ద ఎత్తున నిర్వహించనున్నామని అందరూ పాల్గొని జయప్రదం చేయాలని రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జాఫర్, జిల్లా కార్యదర్శి నారాయణస్వామిలు కోరారు. తాడిపత్రిలో బుధవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో వారు మీడియాతో మాట్లాడారు. స్వాతంత్రోద్యమంలో బ్రిటీషర్స్ తో సీపీఐ పోరాటం చేసిందన్నారు. బ్రిటీషర్స్ కు వ్యతిరేకంగా మొట్టమొదట పోరాడింది సీపీఐ పార్టీ నేనన్నారు. అన్ని వర్గాల ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలన్నారు.