పాణ్యం: కర్నూలు పర్యటనలో గవర్నర్ అబ్దుల్ నజీర్
కర్నూలు పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ బుధవారం ప్రత్యేక విమానంలో కర్నూలు జిల్లా ఓర్వకల్లు ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు. గవర్నర్ ని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, ఎంపీ బస్తిపాటి నాగరాజు, కలెక్టర్ డా.ఏ.సిరి, ఎస్పీ విక్రాంత్ పాటిల్, ఎమ్మెల్యేలు గౌరు చరితారెడ్డి, బొగ్గుల దస్తగిరి తదితర ప్రజాప్రతినిధులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం గవర్నర్ రాయలసీమ యూనివర్సిటీకి బయలుదేరారు.