ప్రకాశం జిల్లా వ్యాప్తంగా కోటి దీపోత్సవం కార్యక్రమం ఘనంగా జరిగింది. భక్తులు దీపాలు వెలిగించి శివ నమస్కరణతో భక్తిని చాటారు. ప్రతి కార్తిక మాసాన్ని పురస్కరించుకొని కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు అర్చకులు తెలిపారు. ముందుగా ఆలయంలోని దేవతామూర్తులను దర్శించుకుని భక్తులు కోటి దీపోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు. భక్తులు భారీగా తరలి రావడంతో ఆలయ కమిటీ సభ్యులు తగు జాగ్రత్తలు తీసుకుంటూ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.