బొమ్మనహాల్ మండలం నేమకల్లు గ్రామంలో APIIC మాజీ చైర్మన్, YSRCP నియోజకవర్గ ఇన్చార్జి మెట్టుగోవిందరెడ్డి పర్యటించారు. శనివారం సాయంత్రం పలువురు సర్పంచ్ లు MPTC లు మండల నేతలతో కలిసి ముందుగా సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఆంజనేయస్వామి ఆలయానికి చేరుకున్నారు. అంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు స్వామి వారి శేష వస్త్రాలతో సత్కరించి ఆశీస్సులు అందజేశారు. అనంతరం స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో స్థానిక పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. పార్టీ ఆధ్వర్యంలో చేపడుతున్న కర్తవ్యాలపై వారికి దిశ నిర్దేశం చేశారు.