రాయలసీమలో శవాల మీద పైసలు ఏరుకునే విదంగా వైసిపి నేతలు ప్రవర్తిస్తున్నారని ప్రభుత్వ విప్ కాలవశ్రీనివాసులు మండిపడ్డారు. గురువారం అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాయలసీమ ప్రాజెక్టుల కోసం 8 వేల కోట్లు ఖర్చు పెట్టామన్నారు. ఒక్క హంద్రీనీవా కే 3 వేల కోట్లు ఖర్చు చేసి రికార్డు స్థాయిలో నీటిని తరలించామని వివరించారు. రాయలసీమలో నిండిన చెరువులు, కాలువలు, కియా లాంటి పరిశ్రమలు కళ్లముందే కనిపిస్తున్నాయన్నారు.