కడప జిల్లా కమలాపురం పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో గురువారం ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి ఆర్డీవోతో కలిసి విజన్ యాక్షన్ ప్లాన్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యాలయం ద్వారా ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కమలాపురం నియోజకవర్గాన్ని 2047 నాటికి స్వర్ణ కమలాపురంగా మారుస్తామని ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు,నాయకులు, తదితరులు పాల్గొన్నారు.