కాశీబుగ్గలో జరిగిన దుర్ఘటనను డైవర్ట్ చేయటానికి టిడిపి జోగి రమేష్ ను అరెస్ట్ చేసిందని ప్రకాశం జిల్లా వైసీపీ నాయకులు ఆరోపించారు. మద్యం కుంభకోణంలో టిడిపి నాయకులే ముఖ్యంగా ఉన్నారని ముందుగా వారినే అరెస్టు చేయవలసి ఉంటుందని వైసిపి నాయకులు విమర్శలు గుప్పించారు. సిబిఐతో ఎంక్వయిరీ చేయించాలని జోగి రమేష్ గత కొద్ది రోజులుగా మాట్లాడుతూనే ఉన్నాడని ఇప్పటికే హైకోర్టులో జోగి రమేష్ కేసు వేసినట్లు వైసిపి నాయకులు అన్నారు.