బాపట్ల పట్టణంలోని భావనారాయణ స్వామి దేవాలయం వద్ద బాపట్ల ఎమ్మెల్యే నిర్వహించిన ముగ్గుల పోటీల్లో విజేతలకు నగదు బహుమతులను అందజేశారు. ఇవాళ బాపట్ల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ దుర్గాప్రసాద్ శాస్త్రి మహిళలకు నగదు బహుమతులిచ్చారు. ఈ పోటీల్లో తులసి రాణి మొదటి స్థానం రూ.5,116, వెంకటలక్ష్మి రూ. 4,116, యోగిత రూ.3,116, అన్యశ్రీ రూ.2,116, ప్రభావతి రూ. 1,116లను అందుకున్నారు.