ఏఐవైఎఫ్ ముఖ్య నాయకుల సమావేశం నంద్యాల పట్టణంలోని సిపిఎం కార్యాలయంలో శుక్రవారం నిర్వహించారు ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి నాగరాముడు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు గంజాయి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని ప్రగల్పాలు పలికిన నాయకులు నేడు ఆ మాటలను విస్మరించి ఎక్కడ చూసినా విచ్చలవిడిగా గంజాయి దొరుకుతుందని విమర్శించారు