ఢిల్లీలో పేలుడు నేపథ్యంలో హైదరాబాదులో పోలీసులు అలర్ట్ అయ్యారు. శంషాబాద్ విమానాశ్రయం తో పాటు సికింద్రాబాద్, నాంపల్లి, చర్లపల్లి రైల్వే స్టేషన్లో అన్ని మెట్రో స్టేషన్లలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. శంషాబాద్ విమానాశ్రయం తో పాటు సిటీలోని పాతబస్తి సహా అన్ని రద్దీ ఏరియాలో పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. క్యాబులు, పార్కింగ్ స్థలాలు, ఇతర ప్రాంతాలకు డాగ్స్ స్క్వాడ్, బాంబు స్క్వాడ్ తో జల్లెడ పడుతున్నారు