మేడ్చల్: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
కూకట్పల్లి శాసనసభ్యులు మాధవరం కృష్ణారావు తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రభాత సేవలు దర్శించుకున్నారు. ఆయనతో పాటు తులసిరావు, రంగారావు, రవీందర్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు.