నాస్తిక ఎల్డీఎఫ్ కేరళ ప్రభుత్వ విధానాల వల్ల శబరిమలలో అయ్యప్ప స్వామి వారి దర్శనార్ధం వస్తున్న అయ్యప్ప భక్తులు పడుతున్న కష్టాలు చూసి హృదయం చలించి పోతుంది. పవిత్ర క్షేత్రం పట్ల కనీస గౌరవం లేకుండా, భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేయడంలో కేరళ కమ్యూనిస్ట్ ప్రభుత్వం పూర్తిగా చేతులెత్తేసింది. అయ్యప్ప సేవా సంఘం, అమృతానందమయి మఠం లాంటి ధార్మిక సంస్థలు సేవ చేయకుండా అడ్డుకోవడం ఈ ప్రభుత్వానికి హిందువుల పట్ల ఎంత వ్యతిరేకత ఉందో తెలియజేస్తుంది. హిందువుల మనోభావాలను గౌరవించని ఈ ప్రభుత్వం తక్షణం తమ వైఖరిని మార్చుకోవాలి. భక్తుల ఇబ్బందులకు కేరళ ప్రభుత్వమే బాధ్యత వహించాలని భారతీయ జన