అల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని శంషుగూడ ఇంద్రహిల్స్ లో విషాదం చోటుచేసుకుంది. భవనం పై నుంచి కిందపడి కార్మికుడు అక్కడికక్కడ మృతి చెందాడు. మృతుడు కర్ణాటక రాష్ట్రానికి చెందిన వెంకటేష్ గా పోలీసులు గుర్తించారు. బాచుపల్లి లో నివాసం అంటూ సెంట్రింగ్ మేస్త్రి రాజు వద్ద గత నాలుగు రోజుల నుంచి పనిచేస్తున్నట్టు స్థానికులు తెలిపారు.