మైనార్టీ స్మశాన వాటికకు స్థల కేటాయింపు కోసం మల్కాజిగిరి నియోజకవర్గంలోని మైనార్టీ ముస్లిం, క్రైస్తవ సముదాయాల స్మశాన వాటిక అవసరాలపై రాష్ట్ర అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమ శాఖ కార్యదర్శి షఫీఉల్లాని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు సానుకూల స్పందనతో అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మైనార్టీ వర్గాల మౌలిక సదుపాయాల అభివృద్ధికి తన వంతు నిరంతర కృషి కొనసాగుతుందని ఎమ్మెల్యే అన్నారు.