దివ్యాంగులను అందరూ గౌరవించాలి, ఎవరు అగౌరపరచకూడదని యాడికి మండల విద్యాశాఖ అధికారి కాశప్ప అన్నారు. యాడికి లోని జడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో, భవిత కార్యాలయంలో బుధవారం అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మండల విద్యాశాఖ అధికారి కాశప్ప మాట్లాడారు. ప్రస్తుతం దివ్యాంగులు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. దివ్యాంగులను ఎవరు తక్కువగా అంచనా వేయకూడదన్నారు. అవమానపరచకూడదన్నారు. దివ్యాంగులు కూడా అందరితో సమానమేనన్నారు.