కొండపి - ఒంగోలు వెళ్లే రహదారులను మూసివేసినట్లు అధికారులు తెలిపారు. వంకలు పొర్లుతుండడంతో గురువారం రాకపోకలకు అంతరాయం కలిగింది.టంగుటూరు మార్గంలో పాలేటిపాడు జయవరం వద్ద వాగులు పొంగుతున్నాయి. కామేపల్లి - టంగుటూరు వెళ్లేందుకు వావిలేడుపాడుదగ్గర వాగుపొంగుతుండడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. అనకర్లపూడి మీదగా వెళ్లేందుకు అట్లేరు మూసి ఉద్ధృతంగా ప్రవహిస్తుంది.దీంతో జిల్లా కేంద్రానికి రాకపోకలు నిలిచిపోయాయి.