అనంతపురం నగరంలోని అంబేద్కర్ ఫ్లైఓవర్ వద్ద ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొన్న ఘటనలో నగరానికి చెందిన రహీంఖాన్, భాష అనే ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన వారిద్దరిని 108 సహాయంతో అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. వారి ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.