లింగాల మండలం కామ సముద్రం లో బుధవారం నిర్వహించిన కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. పులివెందుల వైయస్ రాజారెడ్డి కంటి వైద్యాశాల మరియు ఎల్ వి ప్రసాద్ కంటి వైద్య విజ్ఞాన సంస్థ సహకారం తో స్నేహిత అమృత హస్తం సేవాసమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ వైద్య శిబిరాన్ని గ్రామ సర్పంచ్ పోతిరెడ్డి వెంకట నారాయణ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్బంగా సర్పంచ్ వెంకట నారాయణ రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో సామాజిక నేత్ర చికిత్స శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయం అన్నారు.