ప్రకాశం జిల్లా కొండపి లో ఆదివారం రాత్రి మహిళా ప్రయాణికురాలు కండక్టర్ మధ్య వివాదం తలెత్తి బస్సు గంటకు పైగా నిలిచిపోయింది. బస్సులో 40 మంది ఎక్కవలసి ఉండగా 100 మందికి పైగా ఎక్కడంతో కండక్టర్ ఆవేదన వ్యక్తం చేసింది. బస్సు రోడ్డుకు అడ్డంగా నిలిచిపోవడంతో దాదాపు గంటకు పైగా ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది పోలీసులు అక్కడికి చేరుకొని వివాదాన్ని సద్దు మణిగించడంతో బస్సు గమ్యస్థానానికి తిరిగి బయలుదేరింది.