అనంతపురం నగరంలోని ఎస్బిఐ నగర్ లో మంగళవారం రాత్రి 7:30 సమయంలో సుబ్బరాయుడు అనే రిటైర్డ్ ఉద్యోగి ఇంటిదగ్గర రోడ్డుపైన వాకింగ్ చేస్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు మద్యం మత్తులో సుబ్బరాయుడు పై దాడి చేసి పరారయ్యారు. సుబ్బారాయుడు తీవ్రగాయాలవ్వడంతో మెరుగైన చికిత్స కోసం అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.