జమ్మికుంట: స్వచ్ఛత హి సేవా కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ సిబ్బంది పట్టణంలోని నాయిని చెరువు వద్ద ప్లాస్టిక్ తొలగించిన కార్మికులు
జమ్మికుంట : రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు స్వచ్ఛత హీ సేవ కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ ఆయాజ్ ఆదేశాల మేరకు శుక్రవారం సాయంత్రం పట్టణంలోని నాయిని చెరువు కట్టపై ప్లాస్టిక్, గడ్డిని తొలగించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ జి రాజిరెడ్డి మాట్లాడుతూ నేను స్వచ్ఛత వైపు అంటూ నాయిని చెరువు ప్రాంతంలో ప్లాస్టిక్ తో పాటు గడ్డి మొక్కలను తొలగించడం జరిగిందని అన్నారు. ప్రజలు, యువకులు చుట్టూ పరిసరాలను శుభ్రంగా ఉంచుతూ స్వచ్ఛత వైపు అడుగులు వేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సీనియర్ అసిస్టెంట్ భాస్కర్, శ్రీనివాస్ పాల్గొన్నారు