జవహర్ నగర్ లోని బాలాజీ నగర్ ప్రధాన రహదారి గుండా జిహెచ్ఎంసి చెత్త లారీలు రానివ్వనని బిజెపి నాయకులకు ఇచ్చిన హామీ ప్రకారం బుధవారం రామ్కీ యాజమాన్యం సెక్యూరిటీ ఉద్యోగితో జిహెచ్ఎంసి చెత్త లారీల తనిఖీలు ప్రారంభించింది. రాంకీ సంస్థ చర్యలను ప్రజల పక్షాన సంపూర్ణంగా స్వాగతిస్తున్నట్లు బిజెపి నేత రంగుల శంకర్ తెలిపారు. ప్రజల ప్రాణాలను ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఇలాంటి అనుమతులు లేని జిహెచ్ఎంసి చెత్త లారీలు రాకుండా జిహెచ్ఎంసి అధికారులు సమన్వయంతో కట్టుదిట్టం చేసి వారికి అధికారికంగా కేటాయించిన బండ్లగూడ రోడ్డు ద్వారా వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.