డి.హిరేహాల్ మండల కేంద్రంలోని పౌర గ్రంథాలయంలో 58 వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా విద్యార్థులకు చిత్రలేఖనం పోటీ నిర్వహించారు. గ్రంథాలయాధికారిని హెచ్.ఉషారాణి ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావ్ పూలే గురుకుల పాఠశాలలో ఈ పోటీలు జరిగాయి. విద్యార్థులకు చిన్న తనం నుండి పోటీతత్త్వం అలపడేందుకు ఇవి తోడ్పడతాయన్నారు. కార్యక్రమంలో మహాత్మా జ్యోతిబాపూలే పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు షాజీబా, శోభ, జయలక్ష్మి వీణమ్మ, వాణిశ్రీ తదతర అధ్యాపకులు పాల్గొన్నారు.