విద్యార్థులు పుస్తక పఠనం అలవరచు కావాలని చిత్తూరు ఎంఎల్ఏ గురజాల జగన్మోహన్ అన్నారు. గ్రంథాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమాన్ని గురువారం విజయం డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు గ్రంథాలయానికి రావడం అలవాటు చేసుకోవాలని, తద్వారా తమ భవిష్యత్తుకు ఉన్నతిని ఏర్పరచుకోగలరని పేర్కొన్నారు. అనంతరం వివిధ పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.