కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం అనుబంధ దేవాలయమైన శ్రీ మణికంఠేశ్వర స్వామి ఆలయంలో బుధవారం సాయంత్రం ప్రదోషకాల పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా వైభవంగా మూలవిరాట్ నందీశ్వరుడికి ఏకకాలంలో ప్రత్యేక అభిషేకాలు ప్రత్యేక పూజలు అలంకరణలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ మనీ నాయుడు ఏఈఓ రవీంద్రబాబు వాసు కోదండపాణి తదితరులు పాల్గొన్నారు.