తాడిపత్రిలోని శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసం ఆదివారాన్ని పురస్కరించుకొని తెల్లవారి జాము నుంచే ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు తరలివచ్చారు. ఆలయ ప్రధాన అర్చకులు, వేద పండితులు అర్చనలు, అభిషేకాలు, మహా మంగళహారతి వంటి పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయంతో పాటు పరిసరాల్లో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది.