పాఠశాలల తనిఖీ బృందాలను ఉపాధ్యాయులతో ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (టీపీయూఎస్) జిల్లా అధ్యక్షుడు దత్తాత్రి ఆదివారం డిమాండ్ చేశారు. తనిఖీ బృందాల ఏర్పాటు వల్ల బోధన కుంటుపడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకుని, తనిఖీ బృందాల్లో వేరే వారిని నియమించాలని ఆయన కోరారు.