పెండింగ్లోని వేతనాలు మంజూరు చేయాలి: సీపీఐ తొట్టంబేడు మండలంలోని ఉపాధి హామీ కూలీలకు పెండింగ్లో ఉన్న వేతనాలు మంజూరు చేయాలని సీపీఐ ఆధ్వర్యంలో సోమవారం ఏపీవో కళ్యాణికి వినతి పత్రం అందజేశారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కూలీలు పనులు చేసి 3 నెలలు కావస్తున్నప్పటికీ కూలీలకు చేసిన పనికి వేతనాలు అందలేదని సీపీఐ నాయకులు శివకుమార్ మండిపడ్డారు. ఉపాధి హామీ కూలీల కుటుంబాలు వీధిన పడే పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు.