ప్రకాశం జిల్లా తాళ్లూరు ప్రాథమిక వైద్య కేంద్రం డాక్టర్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. క్యాన్సర్ కు కారకాలైన ధూమపానం మద్యపానం గుట్కా కైనీలాంటి వ్యసనాలకు ప్రజల దూరంగా ఉండాలని డాక్టర్ ప్రవీణ్ కుమార్ అన్నారు. మంచి ఆరోగ్యానికి పోషకాహార పదార్థాలు తీసుకోవాలని సూచించారు. అనంతరం ర్యాలీ నిర్వహించి క్యాన్సర్ వ్యాధికి రకాలను వివరించారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.