బ్రాహ్మణపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడు చికిత్స పొందుతూ మృతి, మృతుడు కృష్ణా నాయక్ గా గుర్తింపు
Anantapur Urban, Anantapur | Nov 13, 2025
అనంతపురం జిల్లాలోని కోడేరు మండలం బ్రాహ్మణపల్లి వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యువకుడు నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడు అనంతపురం నగర శివారులోని కురుగుంట లోని వైయస్సార్ కాలనీకి చెందిన కృష్ణా నాయక్ గా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.