గత 18 నెలల నుంచి రాష్ట్రంలో అదేవిధంగా నగరంలో ముస్లిం మైనార్టీలపై కూటమి ప్రభుత్వా నేతలు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని మరిన్ని ఇబ్బందులకు గురిచేయడం వారి స్థలాలను కబ్జా చేయడం చేస్తున్నారని నగర మేయర్ మొహమ్మద్ వసీం సలీం తీవ్రంగా మండిపడ్డారు. ఎమ్మెల్యే అనుచరుల దాడిలో గాయపడిన నగరానికి చెందిన ఫక్రుద్దీన్ ను యునైటెడ్ జేఏసీ నాయకులు పరామర్శించారు. ఈ సందర్భంగా వారు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.