నంద్యాల జిల్లా నందికొట్కూరు అంగన్వాడీలకు వేతనాలు పెంచాలని అంగన్వాడీ వర్కర్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు వి యేసు రత్నం డిమాండ్ చేశారు, రాష్ట్రంలో గర్భిణీలకు బాలింతలకు చిన్నపిల్లలకు అంగన్వాడీ వర్కర్లు అనేక సేవలు అందిస్తున్నారు, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా అంగన్వాడీల వేతనాలు పెరగడం లేదని గురువారం సాయంత్రం ఆవేదన వ్యక్తం చేశారు, ఈమెరకు ప్రాజెక్టు సిడిపిఓ మంగవల్లికి అంగన్వాడితో కలిసి సమస్యలతో కూడిన మెమోరాండాన్ని అందజేశారు