తిరుమలకు అనుమతి లేదని ఒంటిమిట్టకు పాదయాత్ర ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామిని దర్శించుకోవడానికి రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి శనివారం ఉదయం పాదయాత్ర ప్రారంభించారు. ఆకేపాడులోని దేవాలయాల సముదాయం నుంచి 11వసారి పాదయాత్ర చేస్తున్నారు. ఈరోజు సాయంత్రానికి ఒంటిమిట్ట చేరుకునే స్వామివారిని దర్శించుకోనున్నారు. 22 ఏళ్ళుగా ఆయన తిరుమలకు పాదయాత్ర చేస్తున్నారు. ఈసారి అనుమతి లేకపోవడంతో ఆ పాదయాత్రను ఒంటిమిట్టకు మార్చారు.