ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలోని గడియారం స్తంభం సెంటర్ వద్ద రోడ్డు ప్రమాదాలపై సిఐ రామారావు వాహనదారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ నిబంధనలను పాటించాలని హెల్మెట్ తప్పనిసరిగా ఉపయోగించాలన్నారు. యువత ముందుకు వచ్చి రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో ఎస్సై మురళి తదితరులు పాల్గొన్నారు.