ఉప్పల్ డివిజన్లోని న్యూ భరత్ నగర్ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టినట్లుగా కార్పొరేటర్ మందుమూల రజిత పరమేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. కాలనీలో వెంటనే 19 లక్షలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను చేపట్టాలని అధికారులను ఆదేశించారు.కాలనీలో త్వరలోనే సిసి రోడ్లను సైతం నిర్మాణం చేపట్టనున్నట్లుగా ఈ సందర్భంగా వారు తెలిపారు. ఇవే కాకుండా అభివృద్ధి పనులను చేపట్టి ఈతరా అన్ని రకాల సమస్యలను పరిష్కరించనున్నట్టుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో డి ఈ వెనీల్ గౌడ్, ఏ ఈ రాజ్ కుమార్ పాల్గొన్నారు.