అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం లోని వజ్రకరూరు మండలం పిసి ప్యాపిలి సమీపంలో రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో వెంకటం పల్లికి చెందిన మహేంద్ర అనే పెయింటర్కు తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన అతనిని 108 సహాయంతో మంగళవారం రాత్రి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.