ప్రకాశం జిల్లా కంభం పట్టణంలోని కందులాపురం చెక్ పోస్ట్ వద్ద సోమవారం లారీ, దిచక్ర వాహనం ఢీ కొన్న సంఘటన చోటుచేసుకుంది. ప్రమాదంలో సయ్యద్ అలీ (27) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదం జరిగాక లారీ డ్రైవర్ సంఘటనా స్థలం నుంచి పరారయ్యాడు. జరిగిన సంఘటనపై సమాచారాన్ని అందుకున్న స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. మృతుడు కంభం పట్టణానికి చెందిన యువకుడుగా పోలీసులు తెలిపారు...