కడప జిల్లా జమ్మలమడుగు చెందిన జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బడిగించల చంద్రమౌళి శనివారం బీసీ యునైటెడ్ నేషనల్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు ఓబులేసు యాదవ్ ఆధ్వర్యంలో కడప ప్రెస్ క్లబ్ లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా చంద్రమౌళి మాట్లాడుతూ బీసీలకు చట్ట సభలలో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థలలో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్నారు. మహిళా రిజర్వేషన్ల లో ఓబీసీ మహిళలకు సబ్ కోటా కల్పించాలని తెలిపారు.